అక్టోబర్‌ చివరి నాటికి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తా: ఒమర్ అబ్దుల్లా 

అక్టోబర్‌ చివరి నాటికి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేస్తా: ఒమర్ అబ్దుల్లా 

శ్రీనగర్‌లోని గుప్కర్ రోడ్‌లో తనకు కల్పించిన ప్రభుత్వ వసతి గృహన్ని అక్టోబర్‌ చివరి నాటికి ఖాళీ చేస్తున్నట్లు జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. ఇది తాను స్వచ్చందంగా తీసుకున్న నిర్ణయమన తెలిపిరు. దీనికి సంబంధించి ఆయన జమ్మూ కశ్మీర్‌ అడ్మిస్ట్రేషన్‌కు లేఖ రాశారు.

శ్రీనగర్‌లోని ప్రభుత్వ వసతిని అక్టోబర్ చివరికి ముందే ఖాళీ చేస్తానని లేఖలో తెలిపారు ఒమర్ అబ్దుల్లా. ఇప్పటికే తనకు తగిన ఇంటికోసం వెతుకుతున్నట్లు తెలిపారు. అయితే కరోనా కారణంగా ఆ ప్రక్రియకు ఆలస్యమైందన్నారు. ఇళ్లు దొరకగానే త్వరలోనే గుప్కర్ ప్రభుత్వ వసతిని ఖాళీ చేస్తానన్నారు. దీనికి నాకు 8 నుంచి 10 వారాల సమయం పట్టోచ్చు. అప్పటి వరకు నాకు సమయం ఇవ్వాలని విజ‍్క్షప్తి’ అంటూ జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాన్ని ఆయన విజ్ణప్తి చేశారు. అంతేగాక ప్రభుత్వ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలన్న ఉద్దేశం తనకు లేదని లేఖ ద్వారా తెలిపారు.

గతేడాది ప్రభుత్వ వసతి గృహంలో ఒమర్ అబ్దుల్లా అక్రమంగా ఉంటున్నారని వెంటనే దానిని ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలని జమ్మూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.