గణేష్‌ నిమజ్జనం: మద్యం దుకాణాలు బంద్‌

గణేష్‌ నిమజ్జనం: మద్యం దుకాణాలు బంద్‌

హైదరాబాద్‌: గణేష్‌ నిమజ్జనం చివరి రోజైన మంగళవారం జంటనగరాల్లో శాంతి భద్రల దృష్ట్యా మద్యం దుకాణాలను మూసి ఉంచాలని హైదరాబాద్‌ నగర పోలీస్ ‌కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకూ వైన్‌ షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని తెలిపారు సీపీ అంజనీ కుమార్.