సింగపూర్ : వరల్డ్వైడ్గా ఉన్న కొన్ని ముఖ్యమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన సీనియర్ అధికారులు సింగపూర్లోని షాంగ్రిలా హోటల్లో జరిగిన సెక్యూరిటీ మీటింగ్లో భాగంగా రహస్యంగా సమావేశమైనట్లు ఐదుగురు వ్యక్తులు రాయిటర్స్కు వెల్లడించారు. సింగపూర్ ప్రభుత్వం చాలా ఏండ్లుగా ఇలాంటి సీక్రెట్ మీటింగ్స్ నిర్వహిస్తున్నదని వారు వివరించారు. సెక్యూరిటీ సమిట్లో భాగంగానే ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఓ స్పెషల్ రూమ్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు.
యూఎస్ తరఫున నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ సీక్రెట్ మీటింగ్కు అటెండ్ అయ్యారన్నారు. ఇండియా ఓవర్సీస్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఏజెన్సీ హెడ్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్చీఫ్ సమంత్ గోయెల్ కూడా ఈ మీటింగ్కు అటెండ్ అయినట్లు ఇండియా వర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్ సర్వీసుల్లో చెప్పని కోడ్ ఒకటి ఉందని ఐదుగురు వ్యక్తుల్లోని ఒకరు వివరించాడు. వారంతా అధికారిక, ఓపెన్ డిప్లొమసీ కష్టంగా ఉన్నప్పుడే మాట్లాడుకుంటారని, ఇది ఉద్రిక్త సమయాల్లో చాలా కీలకం అవుతుందన్నారు. సింగపూర్ ప్రభుత్వం సీక్రెట్ మీటింగ్ ప్రోత్సహించడంలో సహాయపడుతున్నదని వివరించారు. షాంగ్రిలా సెక్యూరిటీ మీటింగ్కు వివిధ దేశాల చీఫ్లు అటెండ్ అయినప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన సీనియర్ అధికారులతో సహా పాల్గొనేవారు కూడా తమ సహచరులను కలిసే అవకాశాన్ని ఉపయోగించుకుంటారని సింగపూర్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు.