రాజేంద్రనగర్‌లో షర్మిల మూడో రోజు పాదయాత్ర

రాజేంద్రనగర్‌లో షర్మిల మూడో రోజు పాదయాత్ర

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మూడో రోజు పాదయాత్ర రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. కాచారం క్యాంపు నుంచి పాదయాత్ర ను ప్రారంభించారు షర్మిల. నార్కొడ, అమ్మాపల్లి  మీదుగా శంషాబాద్ కు పాదయాత్ర చేస్తున్నారు. కాచారాం క్రాస్ రోడ్ దగ్గర  షర్మిలను కలిశారు రైతులు. ధరణి వెబ్ సైట్ లోని లోపాలతో... తమకు వారసత్వంగా వస్తున్న భూమిని, సర్కార్ వేరే వారి పేరు మీద ట్రాన్స్ ఫర్ చేసిందన్నారు. తమకు న్యాయం జరగక పోతే ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు.