ఆత్మబలిదానాలకు కేసీఆర్, కేటీఆరే కారకులు ?

ఆత్మబలిదానాలకు కేసీఆర్, కేటీఆరే కారకులు ?
  • యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి

పరిగి, వెలుగు : కేసీఆర్ పేరు చెప్పి సిరిసిల్లలో  దివాకర్ యాదవ్, ఖమ్మంలో ముత్యాల సాగర్, నాగార్జునసాగర్‌‌‌‌లో రవికుమార్, వనపర్తిలో కొండల్, మహబూబాబాద్‌‌లో సునీల్‌‌ చనిపోయారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలో ట్రైన్ కింద పడిన ముత్యాల సాగర్ ఆత్మ బలిదానానికి కేసీఆర్, కేటీఆర్‌‌‌‌ కారణం కాదా? అని ప్రశ్నించారు. యువజన కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్ర బుధవారం సాయంత్రం పరిగి టౌన్​కు చేరింది.

రోడ్ షోలో భాగంగా శివసేనా రెడ్డి మాట్లాడుతూ లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు నాశనమయ్యాయని, కొంతమంది నిరుద్యోగుల తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 1,91,600 ఉద్యోగాలు ఇవ్వలేదని, ఇంకా రాష్ట్రంలో మూడున్నర లక్షల ఉద్యోగాలు పెండింగ్‌‌లో ఉన్నాయన్నారు. పరిగి నియోజకవర్గ, యువజన కాంగ్రెస్‌‌ నేతలు పాల్గొన్నారు.