40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంట్ ఘెరావ్

40 లక్షల ట్రాక్టర్లతో పార్లమెంట్ ఘెరావ్

సికర్: కొత్త అగ్రి చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోకపోతే పార్లమెంట్‌‌ను ఘెరావ్ చేస్తామని రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. రాజస్థాన్‌‌లోని సికర్‌లో యునైటెడ్ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కిసాన్ మహాపంచాయత్‌‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తికాయత్.. ఏ క్షణంలోనైనా ఢిల్లీ మార్చ్‌‌కు సిద్ధంగా ఉండాలని రైతులుకు పిలుపునిచ్చారు. ‘ఈసారి పార్లమెంట్ ముట్టడికి సిద్ధమవ్వండి. దీని గురించి మేం ప్రకటన చేస్తాం. ఢిల్లీ ర్యాలీకి రెడీగా ఉండాలి. అయితే ఈసారి మాత్రం 4 లక్షల ట్రాక్టర్ల స్థానంలో 40 లక్షల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీద్దాం’ అని తికాయత్ పేర్కొన్నారు.