- ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: హర్యానా సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 80 శాతానికి పైగా కోటీశ్వరులే. 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 75 మందికి కోటి కన్నా ఎక్కువ ఆస్తులున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రిపోర్ట్ ఈ వివరాలను వెల్లడించింది.
ముఖ్యాంశాలు
- యావరేజ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆస్తులు: రూ. 12.97 కోట్లు
- 48 మంది బీజేపీ ఎమ్మెల్యేల యావరేజ్ ఆస్తులు: రూ. 10.34 కోట్లు
- 18 మంది ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ) యావరేజ్ ఆస్తులు: రూ. 13.63కోట్లు
- 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల యావరేజ్ ఆస్తులు: రూ. 12.43 కోట్లు
- ఇద్దరు హర్యానా జన్హిత్ కాంగ్రెస్ (బీఎస్) ఎమ్మెల్యేల యావరేజ్ ఆస్తులు: రూ. 80.12 కోట్లు
- ఐదుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల యావరేజ్ ఆస్తులు: రూ. 13.93 కోట్లు
- సీరియస్ క్రిమినల్ కేసులున్నవాళ్లు: ఆరుగురు
- క్రిమినల్ కేసుల్లో ఉన్నవాళ్లు: 10 మంది
- క్రిమినల్ కేసులున్నట్టు ప్రకటించినవాళ్లు: బీజేపీ (5), ఐఎన్ఎల్డీ (2), కాంగ్రెస్, హర్యానా జన్హిత్ కాంగ్రెస్ ( చెరి ఒకరు),ఒక ఇండిపెండెంట్.