పెనుబల్లి, వెలుగు: తమ ఇద్దరు కొడుకులకు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి రావడం ఆ దంపతులు తల్లడిల్లిపోతున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామానికి చెందిన సానిక చెన్నారావు , వనజ దంపతులకు అభిషేక్ కుమార్(11) , క్రిస్టోఫర్ (9) ఇద్దరు కొడుకులు. చెన్నారావు ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. వారి పెద్దకొడుకు అభిషేక్ కుమార్ కు రెండేండ్ల కింద తల నొప్పి, కళ్లు తిరగటం వంటి సమస్యలు రావడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో టెస్ట్లు చేయించగా బ్రెయిన్ ట్యూమర్ అని డాక్టర్లు తెలిపారు.
పెద్ద కొడుకును బతికించడానికి తమకు వున్న కొద్దిపాటి పొలాన్ని, సొంత ఇంటిని అమ్మి రూ.8లక్షలతో ఆపరేషన్ చేయించారు. అయినా కూడా రెండు నెలల తర్వాత బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వచ్చి 2022 జూలై లో చనిపోయాడు. ఆ బాధ నుంచి తేరుకోక ముందే జెనటికల్ వచ్చే వ్యాధి కనుక రెండో కొడుకు క్రిస్టోఫర్ కు టెస్ట్లు చేయించాలని డాక్టర్లు సూచించారు. బెంగుళూర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్లో టెస్ట్లు చేయించగా బ్రెయిన్ ట్యూమర్ మొదటి స్టేజ్లో వుందని డాక్టర్లు తెలపడంతో చెన్నారావు దంపతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పెద్దకొడుకు కోసం ఉన్నదంతా అమ్మి ఖర్చు పెట్టామని, చిన్న కొడుకుకు ఎలా ట్రీట్మెంట్ చేయించాలో అర్థం కాక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
దాతలు స్పందించి, సానిక చెన్నారావు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సత్తుపల్లి బ్రాంచ్, అకౌంట్ నెంబర్ 635202010015892, ఐఎఫ్ఎస్సీ కోడ్ యూబీఐఎన్0563528, ఫోన్పే నెంబర్ 9603396988 లకు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.