
ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్పై జట్టి రవికుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘సర్పంచ్’. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా బోయినపల్లి హనుమంతరావు (జాతీయ స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాల జాతీయ అధ్యక్షుడు) హాజరయ్యారు. ఇదొక సందేశాత్మక చిత్రమని, జూన్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నాం అని దర్శక నిర్మాత జట్టి రవికుమార్ చెప్పారు.