- రోజూ 60 కిలోమీటర్లు తిరుగుతున్న ఆనంద్ వంజపే
- పొల్యూషన్ ఫ్రీ పుణే కోసం లోక్ సభ ఎన్నికల్లో పోటీ
పుణే: ఎన్నికల ప్రచారం అంటే రాజకీయపార్టీలన్నీ భారీ బహిరంగ సభలు.. రోడ్ షోలపైనే ఆధారపడతాయి. కానీ, పుణేకి చెందిన ఆనంద్ వంజపే(43) మాత్రం కాస్త డిఫరెంట్ . సైకిల్పైనే తిరుగుతూ ఓట్లడుగుతున్నాడు. ఏ ఒకట్రెండు కిలోమీటర్ల దూరంకాదు.. రోజుకు సుమారు 60 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ క్యాంపెయిన్ చేస్తున్నాడు.పుణే లోక్ సభ సెగ్మెంట్ నుంచి ఆనంద్ ఇండిపెం డెంట్గా పోటీ చేస్తున్నాడు. అతని అజెండా పుణేని పొల్యూషన్ లేని నగరంగా మార్చడమే. తనను తాను ఎన్వి రాన్మెంట్ పొలిటీషియన్గా చెప్పుకునే ఆనంద్ గత కొన్నేళ్లుగా పొల్యూషన్ ఫ్రీ లైఫ్ స్టైల్ కోసం క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు దానినే తన ఎలక్షన్ అజెండాగా మార్చుకున్నాడు. ఆనంద్ ప్రచారానికి అతని ఫ్రెండ్స్ సపోర్ట్గా నిలుస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా క్యాం పెయిన్ చేయడమే కాక అతనికి కావాల్సిన ఫండ్స్ కూడా సమకూరుస్తున్నారు. లోకల్ బాడీ,అసెంబ్లీ ఎన్నికల్లో కాకుండా లోక్ సభ ఎన్నికల్లోనే ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించగా.. పొల్యూషన్ సిటీకో.. ప్రాంతానికో పరిమితమైన అంశం కాదని, దీ నిపై నేషనల్ పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉందని, అది పార్లమెంట్ స్థాయిలోనే సాధ్యమవుతుందని, అందుకే తాను లోక్ సభకు పోటీ చేస్తున్నట్టు ఆనంద్ చెప్పాడు.