
నైరుతి రుతుపవనాలపై కీలక అప్డేట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని తెలిపింది. మే 31కి నైరుతి రుతుపవ నాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనాలు వేసింది.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమవుతుందన్న వార్తలు వస్తున్న క్రమంలో ఐఎండీ ఈ అప్ డేట్ ఇచ్చింది. బంళాఖాతానికి ఈశాన్యాన ఉన్న అండమాన్, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపనాలు మొదటగా తాకుతాయి. ప్రతియేటా మే 18–20 తేదీల్లో ఈ ప్రక్రియ జరుగుతుంది.. ఇప్పుడు కూడా ఆ సమయానికి తగ్గట్టుగానే నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని ఐఎండీ చెబుతోంది.
మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రకు అతిభారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మే 24 నాటికి అది వాయుగుండంగా మారి రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు IMD తెలిపింది. కోస్తాంధ్ర, తెలంగాణలో అక్కడకక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సౌత్ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.