31తో ముగియనున్న ఆధార్‌-పాన్ లింక్ గడువు

31తో ముగియనున్న ఆధార్‌-పాన్ లింక్ గడువు

ఆదాయపు పన్నుశాఖ ప్రకటించిన ఆధార్‌ పాన్‌ లింకింగ్‌ గడువుకు కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలిఉంది. రిటర్నుదారులు తమ రిటర్నుల్లో ఆదాయపు పన్నుశాఖకు పాన్‌ నెంబరుతోపాటు ఆధార్‌ రెండూ లింక్‌ చేసుకుని ఉండాలి. ఈనెల 31వ తేదీతో ఈ గడువు ముగుస్తోంది. పాన్‌ ఆధార్‌ లింకింగ్‌ తప్పనిసరిచేసింది. ఎవరు లింకింగ్‌ చేసుకోలేకపోయినా వారి పాన్‌నెంబరు చెల్లవని ఆదాయపు పన్నుశాఖప్రకటించింది. ముందు ఐటి అధికారులు సెప్టెంబరు నుంచే అమలుకు తీసుకువస్తామని ప్రకటించారు. అయితే అంతకు ముందు జరిగిన లావాదేవీలు మాత్రం చెల్లుబాటవుతాయి. లావాదేవీల చెలామణిని పరిరక్షించేందుకు పాన్‌కు గడువు పొడిగించి డిసెంబరు 31వ తేదీకి పొడిగించారు. ఆధార్‌తో పాన్‌ లింక్‌ అప్పటికీ కాకపోతే… వారి పాన్‌ నెంబరు చెల్లక పోగా… ఇకపై వారికి పాన్‌కార్డు కూడా జారీచేయడం వీలుపడదని ఐటి అధికారులు చెప్పారు. 31వ తేదీ తర్వాత ఏ లావాదేవీ జరిపినా చట్టబద్ధం కాదు. ఇప్పటి వరకూ కొందరు రిటర్ను దారులు ఆధార్‌ నెంబరును కూడా ఐటి రిటర్నుల్లో పొందుపరచడంలేదు. ఆఫ్‌లైన్‌లోను, ఆన్‌లైన్‌లో కూడా ఆధార్‌ పాన్‌ లింకింగ్‌ వ్యవస్థను పొందుపరిచింది. ఇక పాన్‌ ఆధార్‌ను ఇప్పటికే లింక్‌ అయి ఉంటే వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి.