ఒమిక్రాన్ నుంచి కోలుకొని డిశ్చార్జ్

ఒమిక్రాన్ నుంచి కోలుకొని డిశ్చార్జ్

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది.దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒమిక్రాన్ భయంతో  ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆంక్షలు పెట్టారు. న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కోల్కున్న వ్యక్తిని హాస్పిటల్ నుంచి ఘనంగా సత్కరించి పంపించారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వచ్చిందని ఆ వ్యక్తి తెలిపాడు. అయితే భయపడాల్సిందేమి లేదని చెప్పాడు. పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకున్నాని అన్నాడు. కరోనా వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపాడు.