కరోనా పాజిటివ్‌: ఎయిర్‌‌ ఇండియా ఢిల్లీ ఆఫీస్‌ క్లోజ్‌

కరోనా పాజిటివ్‌: ఎయిర్‌‌ ఇండియా ఢిల్లీ ఆఫీస్‌ క్లోజ్‌
  • ప్యూన్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో
  •  మూడు రోజుల పాటు బంద్‌

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిర్‌‌ ఇండియా ఆఫీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ను అధికారులు మంగళవారం క్లోజ్‌ చేశారు. ఆఫీస్‌లో పనిచేస్తున్న ప్యూన్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో చర్యలు చేప్టటారు. ఈ మేరకు మూడు రోజుల పాటు ఆఫీస్‌ను బంద్‌ చేసి శానటైజేషన్‌ చేయిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌‌ ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాతో సహా ప్రతి ఒక్కరు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తారని అన్నారు. పాజిటివ్‌ వచ్చిన ఇప్పటికే హోం క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు. ఎయిర్‌‌ ఇండియాకు చెందిన 77 మంది పైలెట్లకు టెస్టులు చేయగా.. 5గురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందనే వార్తలు ఇప్పటికే బయటికి వచ్చాయి. అయితే అది కిట్లు సరిగా పరిచేయకపోవడం వల్ల వచ్చాయని అధికారులు చెప్పారు. ఏప్రిల్‌ 20న చివరిసారి డ్యూటీలో ఉన్నవారికి టెస్టులు చేసినట్లు తెలుస్తోంది.