రాష్ట్రంలో యాంటీ వైరల్ డ్రగ్స్ ను పెంచామన్నారు డీఎంఈ రమేశ్ రెడ్డి. ఆరు నెలల నుంచి కరోనా మీదే పోరాడుతున్నామని..ఇంకా ఎన్నో వ్యాధులు ఉన్నాయన్నారు. 319 మంది కాంట్రాక్టు మెడికల్ స్టాఫ్ ను పెంచామన్నారు. సర్జరీలకు ఎలాంటి సమస్య లేదని అత్యవసర సేవలన్నీ యధావిధిగా జరుగుతున్నాయన్నారు.
డెంగ్యూ ఫీవర్ , స్వైన్ ఫ్లూ వంటి రోగాలు ఈ సీజన్ లో ఎక్కువ.. కానీ ఈ ఏడాది తక్కువగా నమోదయ్యాయన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆరోగ్యం కూడా తమకు ముఖ్యం.. వారికి తగిన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామన్నారు. 16 మంది చనిపోయారన్నారు. ప్రధాన మంత్రి ప్రకటించిన ఏక్షగ్రేషియాకు ఒక ఆఫీసర్ ను పెట్టమన్నారు. డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తున్నామని..ఇన్సురెన్స్ ఏజెన్సీకి అప్పగించారన్నారు.
For More News..