పోలీసులకు కంప్లయింట్
చేసిన కార్పొరేషన్ కమిషనర్
జవహర్ నగర్, వెలుగు: షీ టాయిలెట్స్కు కేటాయించిన భూమిని కొందరు ఆక్రమించుకునేందుకు యత్నించారు. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ మెయిన్ రోడ్డులో ని కోట్ల విలువైన 1500 గజాల సర్కార్భూమిలో కొన్ని నెలల కిందట షీ టాయిలెట్స్అప్పటి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. టాయిలెట్స్నిర్మాణానికి కార్పొరేషన్ అధికారులు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటుండగా, కొందరు కబ్జాదారులు స్థానిక రాజకీయ నేతలు, అధికారుల మద్దతుతో రాత్రికి రాత్రే రూం కట్టే ప్రయత్నం చేశారు. స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. మంగళవారం కార్పొరేషన్ కమిషనర్ నేతి మంగంమ్మ వెళ్లి పరిశీలించారు. వెంటనే జవహర్ నగర్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయం లేకుండా ఎలా జరుగుతున్నాయనే అనుమానాలు వస్తున్నాయి.