షీ టాయిలెట్స్​ స్థలం కబ్జాకు యత్నం

షీ టాయిలెట్స్​ స్థలం కబ్జాకు యత్నం

పోలీసులకు కంప్లయింట్
చేసిన కార్పొరేషన్​ కమిషనర్​

జవహర్​ నగర్​, వెలుగు:  షీ టాయిలెట్స్​కు కేటాయించిన భూమిని కొందరు ఆక్రమించుకునేందుకు యత్నించారు.  జవహర్​నగర్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని బాలాజీ నగర్​ మెయిన్ రోడ్డులో ని కోట్ల విలువైన 1500  గజాల సర్కార్​భూమిలో కొన్ని నెలల కిందట షీ టాయిలెట్స్​అప్పటి కలెక్టర్​ శంకుస్థాపన చేశారు. టాయిలెట్స్​నిర్మాణానికి  కార్పొరేషన్​ అధికారులు పనులు చేపట్టేందుకు  చర్యలు తీసుకుంటుండగా, కొందరు కబ్జాదారులు స్థానిక రాజకీయ నేతలు, అధికారుల మద్దతుతో  రాత్రికి రాత్రే రూం కట్టే ప్రయత్నం చేశారు.  స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.  మంగళవారం కార్పొరేషన్​ కమిషనర్​ నేతి మంగంమ్మ వెళ్లి పరిశీలించారు. వెంటనే జవహర్​ నగర్​ పోలీసులకు కంప్లయింట్​ చేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయం లేకుండా ఎలా జరుగుతున్నాయనే అనుమానాలు వస్తున్నాయి.