
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్(Kevvu Karthik) ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి క్యాన్సర్తో కన్నుమూశారు. దాదాపు ఐదేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు కార్తీక్.
అమ్మా.. దాదాపు ఐదు సంవత్సరాల 2 నెలలుగా క్యాన్సరే భయపడేలా దానిపై అలుపెరగని పోరాటం చేశావు. నీ జీవితమంతా యుద్ధమే. మమ్మల్ని కన్నావు, నాన్నకు తోడుగా ఉన్నావు, కష్ట పరిస్థితుల్లో కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నావు. నీ ఆత్మస్థైర్యం నాలో కొండంత ధైర్యాన్ని నింపింది. అన్నీ నేర్పావు కానీ.. నువ్వు లేకుండా ఎలా బతకాలో నేర్పించలేదు.. ఎందుకమ్మా..? అంటూ ఎమోషనల్ అయ్యారు కార్తీక్. అంతేకాదు.. తన అమ్మ కోసం ప్రార్థించిన ప్రతీ ఒకరికి, అలాగే తన అమ్మకు చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం కెవ్వు కార్తీక్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవగా.. కార్తీక్ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.