రాష్ట్రంలో ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీం పత్తా లేదు!

రాష్ట్రంలో ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీం పత్తా లేదు!
  • అమలు చేస్తున్నట్టు రాష్ట్ర సర్కారు ప్రకటించి 8 నెలలాయె
  • ఇప్పటికీ అందుబాటులోకి రానేలేదు
  • ఆరోగ్యశ్రీ అమలునూ పట్టించుకుంటలే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకం ‘ఆయుష్మాన్ భారత్ ’ను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర సర్కార్ తటపటాయిస్తోంది. ఆరోగ్యశ్రీతో కలిపి ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాష్ట్రంలో అమలు చేయబోతున్నట్టు గతేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే సీఎస్  సోమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చి 8 నెలలు అవుతున్నా.. ఇప్పటివరకు పథకాన్ని అమల్లోకి తేలేదు. ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెంటనే అమల్లోకి తెస్తున్నామని, విధివిధానాలన్నీ ఖరారయ్యాయని  ఈ ఏడాది మే నెలలో సీఎంవో నుంచి మరో ప్రకటన రిలీజ్ అయింది. ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమల్లోకి తెస్తున్నట్టు, అదేరోజు సాయంత్రం హెల్త్ సెక్రటరీ ఉత్తర్వులిచ్చారు. లూ వచ్చాయి. ఆరోగ్యశ్రీ కింద ఉన్న ఆస్పత్రులు ఆయుష్మాన్ కింద ప్రజలకు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందించాలని, ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని అందులో పేర్కొన్నారు. ఉత్తర్వులు వచ్చి 3 నెలలు అవుతున్నా.. ఒక్క పేషెంట్​కు  కూడా ఆయుష్మాన్ కింద ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఇయ్యలేదు. అసలు ఇప్పటివరకు తమకు సమాచారమే లేదని, ఆ విధివిధానాలేంటో వివరాలు ఇవ్వలేదని ఆరోగ్యశ్రీ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యజమానులు చెప్తున్నారు. ఆయుష్మాన్  భారత్​ స్కీం అమలు చేస్తున్నట్టు పేపర్లలో చదవడమే తప్ప, తమకు ఇంత వరకూ అధికారికంగా సమాచారం ఇవ్వలేదని ఆరోగ్యశ్రీ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్కర్ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్ రాకేశ్​ అన్నారు. కరోనా సెకండ్ వేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమయంలో ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను దారి మరల్చడానికే సీఎం కేసీఆర్​  ఆయుష్మాన్  స్కీం పేరిట నాటకం ఆడారన్న విమర్శలు వస్తున్నాయి.

ఆరోగ్యశ్రీ డబ్బులు ఇయ్యట్లే
ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్​ స్కీమ్​ను పక్కకు బెట్టిన రాష్ట్ర సర్కార్​.. ఆరోగ్యశ్రీ అమలుపైనా శ్రద్ధ పెడ్తలేదు. ఆరోగ్యశ్రీ కింద ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందించే దవాఖాన్లకు సకాలంలో డబ్బులు ఇస్తలేదు. కోట్లల్లో బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఆరోగ్యశ్రీ పేషెంట్లను చేర్చుకునేందుకు ప్రైవేటు, కార్పొరేటు హాస్పిటళ్లు సంకోచిస్తున్నాయి. కొన్ని దవాఖాన్లు ఇప్పటికే పూర్తిగా ఆరోగ్యశ్రీని పక్కకుపెట్టగా.. మరికొన్నింటిలో పెద్ద కేసులను మాత్రమే అడ్మిట్ చేసుకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు వచ్చాక వాపస్ ఇస్తామని చెప్పి ముందే అడ్వాన్ కట్టించుకుంటున్నారు. చివరికి ప్రభుత్వ దవాఖాన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆరోగ్యశ్రీ నుంచి రిలీజ్ అయ్యాక రీఫండ్ చేస్తామని చెప్పి ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జే  కేన్సర్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదే విషయమై ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్ సిటీ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓ లెటర్ కూడా రాశారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన సమస్యలు చెప్పుకునేందుకే తమకు ఎవరూ దిక్కు లేరని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీకి పూర్తి స్థాయిలో సీఈవోను నియమించాలని కోరుతున్నారు. 

సమాచారమే లేదు
ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలు గురించి మాకు ఇప్పటివరకు సమాచారమే లేదు. ఆరోగ్యశ్రీ సర్వీసులు ఆపేసినప్పుడు తప్ప, ఆ తర్వాత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన డబ్బులు ఏడాది నుంచి రావడం లేదు. ఆరోగ్యశ్రీ డబ్బులు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రిలీజ్ చేయడం లేదు. అన్నీ కలిపి సుమారు రూ. 500 కోట్లు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రావాల్సి ఉంది. ఇన్నేసి కోట్లకు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పెడ్తాం? మాకు రావాల్సినవి వచ్చేసరికి, మేం కట్టాల్సిన వడ్డీలు డబుల్ అవుతున్నాయి. చిన్న చిన్న హాస్పిటళ్ల వాళ్లు ఆరోగ్యశ్రీతో తీవ్రంగా నష్టపోతున్నారు. 
- డాక్టర్ రాకేశ్, ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆరోగ్యశ్రీ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌