గచ్చిబౌలిలో కూలిన భవనం..10 మందికి తీవ్ర గాయాలు

గచ్చిబౌలిలో కూలిన భవనం..10 మందికి తీవ్ర గాయాలు

హైదరాబాద్: కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్ మెంట్ భవనం కూలడంతో దాదాపు 10 మందికి తీవ్రగాయాలైన సంఘటన ఆదివారం గచ్చిబౌలి పరిధిలో జరిగింది. నుతనంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనంలొని రెండో ఫ్లోర్ పై కప్పు ప్రమాదవశాత్తు కులిపోయింది. దీంతో దాదాపు పది మంది కూలీలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడ్డవారిని స్థానిక హాస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు డాక్టర్లు.

సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు..సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించామని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్లాబ్ కూలిన ఘటనలో హిమగిరి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కూలీలు…..శ్రవణ్, సురేష్, రాజన్ కుమార్, రాజ్ కుమార్, జయప్రకాష్, రామ్ సింగ్, సందీప్, సాకర్ గా గుర్తించామని.. తెలిపారు గచ్చిబౌలి పోలీసులు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.