- ఎమ్మెల్యే మిల్లులనే కాంటా కొట్టిన్రు
- అధికార పార్టీ లీడర్ రైస్ మిల్లు వే బ్రిడ్జ్ లో మోసం
- టన్నుకు 28 కిలోలు తక్కువ చూపుతోంది
- రెండు చోట్ల వెయిట్ చూసి మోసాన్ని తేల్చిన రైతులు
జగిత్యాల, మల్లాపూర్, వెలుగు: రైస్మిల్లులకు పంపే వడ్ల తూకాల్లో మోసం జరిగినప్పుడు రైతులు అక్కడి ఎమ్మెల్యేలు, ఆఫీసర్లకు గోడు వెల్లబోసుకోవడం ఇప్పటిదాక చూశాం. కానీ ఓ ఎమ్మెల్యేకు చెందిన రైస్మిల్లులోనే కాంటా కొట్టడంతో రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని స్వయంగా తామే బయటపెట్టి, తహసీల్దార్కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట్ శివారులో నిర్మల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు రైస్ మిల్ ఉంది. బినామీ పేర్లతో నడుపుతున్నా తెరవెనుక వ్యవహారాలన్నీ ఎమ్మెల్యేనే చూసుకుంటున్నారు. కొత్తగా నిర్మిస్తున్న ఈ మిల్లు పనులు ఇంకా 60శాతం మాత్రమే పూర్తయ్యాయి. రూల్స్ ప్రకారం ఈ మిల్లుకు వడ్ల కేటాయింపులు చేయవద్దు. కానీ సదరు లీడర్ ఒత్తిళ్లతో ఆఫీసర్లు మల్లాపూర్మండలంలోని పలు సెంటర్లను కేటాయించారు. ఈ క్రమంలోనే సెంటర్ల నుంచి వచ్చే వడ్లలో తరుగు, వెయిట్లాస్ కింద భారీగా కోత పెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. పోయిన నెల19న మల్లాపూర్ ప్యాక్స్సెంటర్ నుంచి 915 బస్తాలను మిల్లుకు తరలించారు. అందులో ఏకంగా 73 బస్తాలను కట్ చేశారు. అంతకుముందు ఇలాగే మూడు లారీలకు 50, 47, 35 బస్తాల చొప్పున కోత పెట్టారు. దీంతో రైతులకు అనుమానం వచ్చి సెంటర్ నిర్వాహకులను నిలదీశారు. వెయిట్ లాస్ కింద పోతోందని, డబ్బుల్లో కటింగ్ తప్పదని చెప్పడంతో సుమారు 40 మంది రైతులు బుధవారం నేరుగా రంగంలోకి దిగారు. మొదట రైస్ మిల్ కు చెందిన వే బ్రిడ్జిపై ఖాళీ ట్రాక్టర్ ను ఉంచి వెయిట్చూశారు. ఆ తర్వాత పక్కనే ఉన్న వే బ్రిడ్జిపై సేమ్ ట్రాక్టర్ వెయిట్చూడగా 90కిలోలు తేడా వచ్చింది. దీంతో మోసపోతున్నామని తెలుసుకున్న రైతులు తహసీల్దార్ రవీందర్కు బుధవారం కంప్లయింట్ ఇచ్చారు. ఇన్నిరోజులు తమ దగ్గర కటింగ్పెట్టిన మొత్తం ధాన్యానికి ఖరీదు కట్టి ఇవ్వాలని, సదరు మిల్లు ఓనర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.