న్యూఢిల్లీ: కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, మరో కాంగ్రెస్ లీడర్ డీకే శివకుమార్కు రాష్ట్ర బీజేపీ సర్కార్ లీగల్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో విఫలమైందంటూ సదరు నేతలు చేసిన వ్యాఖ్యలు తమ పార్టీ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ మండిపడింది. కరోనాకు సంబంధించిన ఎక్విప్మెంట్ కొనుగోలులో రూ.2 వేల కోట్ల పైచిలుకు స్వామ్కు పాల్పడ్డారని బీజేపీ సర్కార్పై సిద్ధరామయ్య, డీకే దుయ్యబట్టారు. ఈ విషయంలో విచారణ జరగాలని వారు డిమాండ్ చేశారు.
కర్నాటక అసెంబ్లీలో సిద్ధరామయ్య లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఉన్నారు. సిద్ధరామయ్యతోపాటు ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న డీకే శివకూమార్ మాట్లాడుతూ స్టేట్ గవర్నమెంట్ రూ.4,167 కోట్లను మహమ్మరి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి వెచ్చించిదన్నారు. ఇందులో రెండు వేల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు, గ్లోవ్స్ కొనుగోలులో అవినీతి చేశారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను బీఎస్ యడ్యూరప్ప నాయకత్వంలోని బీజేపీ సర్కార్ తిప్పి కొట్టింది. ఆరోపణలు అవాస్తవమని, ఆధారం లేనివని ఘాటుగా స్పందించింది. తాజాగా దీనిపై బీజేపీ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని యత్నించారంటూ సివిల్ క్రిమినల్ ఆఫ్ డిఫమేషన్ ద్వారా నోటీసులు జారీ చేసింది.