చాయ్ వాలాగా సీఎం మమతా బెనర్జీ

చాయ్ వాలాగా సీఎం మమతా బెనర్జీ

పాలనా వ్యవహారాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చాయ్ వాలా అవతారమెత్తారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్లి వస్తూ దిఘాలోని దత్తాపూర్ పూర్ లో ఉన్న ఓ చిన్న టీ దుకాణం దగ్గర ఆమె ఆగారు. కారు దిగి షాపుకెళ్లిన మమతా ఆ షాపు యజమానితో మాట్లాడారు. తర్వాత స్వయంగా టీ పెట్టి తన పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు. మమత ఉదాసీనతను చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

మమత అక్కడ ఉన్నారనే వార్త తెలుసుకుని భారీ సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకున్నారు. దీంతో, పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా అక్కడకు చేరుకుంది. అయితే… సెక్యూరిటీని రావద్దని చెప్పిన దీదీ… అక్కడున్న వారితో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత తిరుగుపయనమయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. చిన్నచిన్న ఆనందాలు జీవితాన్ని ఆనందమయం చేస్తాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.