ఆలేరు (యాదాద్రి), వెలుగు: యాదాద్రి జిల్లా ఆలేరు పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు,ఎస్ఐలు, ఎస్వోటీ, ఆర్మ్ రిజర్వ్ స్టాఫ్ కలిపి మొత్తంగా 200 మంది ఆయుధాలతో పోచమ్మ గుడి ఏరియాకు చేరుకొని భారత్నగర్, రఘునాథ్పూర్ రోడ్డుపై ఇండ్లలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఇద్దరు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని వారి వివరాలు సేకరించారు. 50 లీటర్ల అక్రమ లిక్కర్, పత్రాలు లేని 8 గ్యాస్ సిలిండర్లు, 31 టూ వీలర్లు, కార్లు, మూడు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.
