ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ పై నాలుగుసార్లు విజయం సాధించామన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. హైదరాబాద్ దుండిగల్ లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ వేడుకల్లో రాజ్ నాథ్ పాల్గొన్నారు. ఇండో-చైనా టెన్షన్, కరోనా టైంలోనూ ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, టెక్నాలజీ సాయంతో.. భారత వాయుసేన మరింత శక్తిమంతం అయ్యిందన్నారు. బాలాకోట్ దాడులతో భారత ఎయిర్ ఫోర్స్ సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు రాజ్ నాథ్. రఫెల్ యుద్ధ విమానాలు ఎయిర్ పోర్స్ కి మరింత బలం ఇచ్చిందన్నారు. దేశ రక్షణ త్రివిధ దళాలపై ఉందన్న ఆయన..నిరంతరం అలర్ట్ గా ఉండాలన్నారు. శ్రీలంక-వియత్నం-నైజిరియా దేశాలకు చెందిన వారికి సైతం ఇండియాలో ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. శత్రువులను ఎలాంటి పరిస్థితి లోనైనా ఎదుర్కోగలమని ఇప్పటికే నిరూపించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ ఫోర్స్ కళ్లు చెదిరే విన్యాసాలను ప్రదర్శించింది.
Telangana: Combined Graduation Parade at Airforce Academy in Dundigal, goes on in Hyderabad with Defence Minister Rajnath Singh in attendance
Visuals from the parade ceremony pic.twitter.com/BPvVyMHcu5
— ANI (@ANI) December 19, 2020