పాల్వంచ రిజర్వ్ ఫారెస్టులో ఎన్ కౌంటర్..తప్పించుకున్న మావోలు

పాల్వంచ రిజర్వ్ ఫారెస్టులో ఎన్ కౌంటర్..తప్పించుకున్న మావోలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఇవాళ మధ్యాహ్నం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. కాల్పులు జరుపుతూ నక్సల్స్ తప్పించుకున్నారు.  తర్వాత ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా  ఎస్బిబిఎల్ తుపాకీ, కిట్ బ్యాగులు, సోలార్ ప్లేట్ తదితర సామగ్రి లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న పోలీసులు… తప్పించుకుని పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.