జైల్లో ESI స్కాం నిందితురాలు పద్మ ఆత్మహత్యాయత్నం

జైల్లో ESI స్కాం నిందితురాలు పద్మ ఆత్మహత్యాయత్నం

ఈఎస్ఐ స్కాం నిందితుల్లో ఒకరైన జాయింట్ డైరెక్టర్ పద్మ శనివారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ESI స్కాంలో ఆమె పాత్ర కూడా ఉన్నట్టు అనుమానించిన ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మనస్తాపం చెందిన పద్మ తన దగ్గర ఉన్న నిద్రమాత్రలు ఎక్కువ సంఖ్యలో ఒకే సారి మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న జైలు సిబ్బంది వెంటనే ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ఎమర్జెన్సీ వార్డులో పద్మకు చికిత్స అందించిన డాక్టర్లు ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. ESI స్కాంలో ఇప్పటికే పద్మతో పాటు మరికొందరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.