ఆ ఊరిలో ఒక్కరికి తప్ప అందరికీ కరోనా!

ఆ ఊరిలో ఒక్కరికి తప్ప అందరికీ కరోనా!

షిమ్లా: కరోనా వ్యా ప్తి రోజురోజుకీ ఎక్కువవుతోంది. కొన్ని రోజులు నెమ్మదించిన మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నట్లే కనిపిస్తోంది. యూరప్‌లోని కొన్ని దేశాల్లో కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి. మన దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీన్ని పక్కనబెడితే.. హిమాచల్ ప్రదేశ్‌‌, లాహౌల్ జిల్లాలోని తోరంగ్ అనే గ్రామంలోని ప్రజలందరకీ కరోనా సోకడం సంచలనంగా మారింది. తోరంగ్‌‌లోని భూషణ్ ఠాకూర్ (52) అనే వ్యక్తిని మినహాయిస్తే మిగిలిన గ్రామస్థులందరికీ కరోనా సోకింది. రీసెంట్‌‌గా ఆ గ్రామంలో నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఊరి వాళ్లందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వల్లే గ్రామస్థులకు కరోనా సోకిందని సమాచారం. ఈ ప్రోగ్రామ్‌‌లో సమీప గ్రామస్థులు కూడా పాల్గొనడంతో వారికీ కరోనా సోకే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. తోరంగ్ గ్రామ జనాభా 42 మందే కావడం గమనార్హం.