షిమ్లా: కరోనా వ్యా ప్తి రోజురోజుకీ ఎక్కువవుతోంది. కొన్ని రోజులు నెమ్మదించిన మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నట్లే కనిపిస్తోంది. యూరప్లోని కొన్ని దేశాల్లో కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి. మన దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీన్ని పక్కనబెడితే.. హిమాచల్ ప్రదేశ్, లాహౌల్ జిల్లాలోని తోరంగ్ అనే గ్రామంలోని ప్రజలందరకీ కరోనా సోకడం సంచలనంగా మారింది. తోరంగ్లోని భూషణ్ ఠాకూర్ (52) అనే వ్యక్తిని మినహాయిస్తే మిగిలిన గ్రామస్థులందరికీ కరోనా సోకింది. రీసెంట్గా ఆ గ్రామంలో నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఊరి వాళ్లందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వల్లే గ్రామస్థులకు కరోనా సోకిందని సమాచారం. ఈ ప్రోగ్రామ్లో సమీప గ్రామస్థులు కూడా పాల్గొనడంతో వారికీ కరోనా సోకే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. తోరంగ్ గ్రామ జనాభా 42 మందే కావడం గమనార్హం.
ఆ ఊరిలో ఒక్కరికి తప్ప అందరికీ కరోనా!
- దేశం
- November 20, 2020
లేటెస్ట్
- అంత్యక్రియలకు కట్టెల కష్టాలు
- కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన
- కోటి రూపాయలు.. 3 కిలోల గోల్డ్ సీజ్
- వన్యప్రాణుల దాహం తీర్చేలా
- మెట్రో విస్తరణతో ఎల్బీనగర్ రూపురేఖలు మారుతయ్
- వీ6 జిల్లా ప్రతినిధి పై దౌర్జన్యం
- ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫ్లాట్లో అగ్ని ప్రమాదం
- Premalu Sequel Official: మరింత ప్రేమతో ప్రేమలు2 వచ్చేస్తోంది..అనౌన్స్ చేసిన మేకర్స్
- మున్నేరు కాంక్రీట్ వాల్ పనులు పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- ఏప్రిల్ 21న టీఎస్ ఆర్జేసీ ఎంట్రెన్స్ టెస్టు
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి