కరీంనగర్ టౌన్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతికంగా తానే విజయం సాధించానని కరీంనగర్మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ రవీందర్ సింగ్అన్నారు. ఇండిపెండెంట్ గానే కొనసాగుతూ కొర్పొరేషన్లో జరుగుతున్న అవినీతిని బయటపెడ్తానని చెప్పారు. ఆదివారం సిటీలోని ఓ ప్రైవేట్హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను రాజీనామా చేయమని కోరేముందు వేరే పార్టీల్లోంచి టీఆర్ఎస్ లో చేరిన లీడర్లందరిని రాజీనామా చేయించాలని కోరారు. ఓటర్లను అధికార పార్టీ ఎన్నో ప్రలోభాలకు గురి చేసిందని ఆరోపించారు. తాను పోటీలో ఉండడంతోనే మినిష్టర్ ఆధ్వర్యంలో క్యాంపు రాజకీయాలు చేపట్టారని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను భయాందోళనకు గురి చేశారన్నారు. ఎలక్షన్రూల్స్అతిక్రమించినా పోలీసులు అధికార పార్టీకే మద్దతిచ్చారని పేర్కొన్నారు. ఓటర్లను వెహికల్స్లో తరలించొద్దనే రూల్ను పక్కన పెట్టారని మండిపడ్డారు. పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్స్ తీసుకెళ్లడం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో భానుప్రసాద్ రావుతో పాటు రమణకు సమాన ఓట్లు రావాలని అన్నారు. ఓట్లు ఎవరికి తగ్గినా నైతిక బాధ్యత మంత్రి గంగుల కమలాకర్ దేనని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్కమిషనర్, ఎస్ఈతో పాటు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ లాంగ్ లీవ్ తీసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎవరి ఒత్తిడితో వారు లీవ్ తీసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతిని బయటపెడ్తా
- తెలంగాణం
- December 13, 2021
లేటెస్ట్
- అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు
- ఎన్నికల హింస ఎఫెక్ట్: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన ఈసీ..
- MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ గొప్ప క్రికెటర్గా ఎదిగాడు: సునీల్ గవాస్కర్
- కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో భారీ అగ్ని ప్రమాదం
- Prithviraj Sukumaran: రాజమౌళి SSMB29లో పృథ్విరాజ్ సుకుమారన్..మహేష్ బాబుకి ధీటైన పాత్రతో సిద్ధం!
- ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు..
- ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు.. 50 మంది మృతి, 200 ఇండ్లు నేలమట్టం
- Virat Kohli: ధోనీతో ఇదే నా చివరి మ్యాచ్.. మహి రిటైర్మెంట్పై కోహ్లీ హింట్
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్