- భవిష్యత్ ప్రయోగాలను అది మరింత ముందుకు తీసుకెళుతుంది
విక్రమ్ ల్యాండింగ్ ఫెయిలవడంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ ప్రయత్నం మరిన్ని పెద్ద ప్రాజెక్టులను ముందుకు తీసుకెళుతుందని ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ అన్నారు. విక్రమ్తో లింక్ కలిపే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా పోయాయని ఆయన చెప్పారు. చంద్రయాన్2 ప్రయోగం 98 శాతం సక్సెస్ అయిందన్న ఇస్రో చైర్మన్ శివన్ వ్యాఖ్యలను విమర్శిస్తున్న వారిని ఆయన తప్పుబట్టారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ ప్రయోగాలు చేస్తూ సక్సెస్ అవుతున్న సంస్థ, దేశంలో ఒక్క ఇస్రో మాత్రమేనన్నారు. గత కొన్నేళ్లుగా అది నిరూపితమవుతూనే ఉందన్నారు. ‘‘ప్రయోగాలన్నది ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదు. అక్కడ ఓ వ్యవస్థ ఉంటుంది. అందరూ కలిసి చర్చించే ప్రయోగం చేస్తారు. డిజైన్లు, టెస్టింగ్ అన్ని చూసుకుంటారు. ఒకటికి పదిసార్లు చర్చించాకే ముందుకెళతారు” అని ఆయన అన్నారు. విక్రమ్ ల్యాండర్తో కమ్యూనికేషన్ను పునరుద్ధరించేందుకు సైంటిస్టులు చాలా విధాలుగా ప్రయత్నించారన్నారు. ఎన్నెన్నో పద్ధతులు వాడారన్నారు. ఒక్క సాఫ్ట్ల్యాండింగ్ను పక్కనపెడితే చంద్రయాన్ 2లోని అన్ని మిషన్లు సక్సెస్ అయ్యాయని ఆయన అన్నారు. సాఫ్ట్ల్యాండింగ్ చాలా కష్టమైన పని అన్నారు. ల్యాండర్లోని సెన్సర్లు మొరాయించి ఉండొచ్చని, లేదంటే సాఫ్ట్వేర్లో లోపాల వల్ల కూడా విక్రమ్ ల్యాండింగ్ ఫెయిలై ఉండొచ్చని ఆయన అన్నారు. శివన్ చెప్పినట్టు చంద్రయాన్ 2 ప్రయోగం 98% సక్సెస్ అన్నారు.