ఫిలిప్పీన్స్‌‌లో గాంధీజీ

ఫిలిప్పీన్స్‌‌లో గాంధీజీ

ఫిలిప్పీన్స్​లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు గర్వకారణమని ఇండియన్​ ప్రెసిడెంట్​ రామ్​నాథ్​ కోవింద్​ అన్నారు. గాంధీజీ 150వ జయంతి వేడుకల్లో భాగంగా ఇండియన్ల తరఫున ఫిలిప్పీన్స్‌‌​ ప్రజలకు ఇది కానుక అని చెప్పారు. మనీలాలోని మిరియం కాలేజ్​ ఆవరణలో ఆదివారం ఆయన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్ముడు అందరి వాడని, అన్ని సమాజాలకు, సంస్కృతులకు చెందినవారని చెప్పారు. ఐదు రోజుల ఆగ్నేయ ఆసియా దేశాల టూర్​ లో భాగంగా ప్రెసిడెంట్ కోవింద్ దంపతులు ఆదివారం ఫిలిప్పీన్స్​లో పర్యటించారు.