వెల్లడించిన మధ్యప్రదేశ్ మినిస్టర్
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్లో 8 మంది పోలీసుల మృతికి కారణమై తప్పించుకుని తిరుగుతూ పోలీసులకు దొరికిన గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఫేక్ ఐడీతో నాలుగు రాష్ట్రాలు తిరిగాడని మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ మిశ్రా అన్నారు. తన ఇద్దరు అనుచరుల హెల్ప్తో తిరిగాడని, పాల్ అనే పేరుతో తిరిగాడని అన్నారు. ఉజ్జయిని గుడికి కూడా వీఐపీ పాస్పై వెళ్లాడని అన్నారు. పాస్లు ఎలా వచ్చాయనే దానిపై విచారణ జరుపుతున్నామని అన్నారు. యూపీలోని బికూర్ గ్రామానికి చెందిన దుబేను అరెస్టు చేసేందుకు పోలీసులు గ్రామానికి వెళ్లగా.. దాని గురించి ముందే సమాచారం తెలుసుకున్న దుబే, అనుచరులు దాడి చేసి 8 మంది పోలీసులను చంపేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న దుబేను పోలీసుల ఉజ్జయిని ఆలయం దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఆ టైంలో ఆయన ‘నేను వికాస్ దుబే.. కాన్పూర్ గ్యాంగస్టర్’ అని అరవగా పోలీసులు అతని చంపపై దెబ్బలు కొట్టినట్లు వీడియో బయటికి వచ్చింది.