హైదరాబాద్ లో కుక్కల నివారణకు జీహెచ్ఎంసీ హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. మేయర్ అధ్యక్షన అన్ని పార్టీల కొర్పొరేటర్లు, అధికారులు ఈ కమిటీలో ఉన్నారు. కుక్కల నివారణకు సూచనలు, పలు సలహాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది.జీహెచ్ఎంసీ యానిమల్ కేర్ సెంటర్లను పరిశీలించనుంది.
ఇటీవల అంబర్ పేటలో కుక్కలు దాడి చేయడంతో ఆరేళ్ల బాలుడి చనిపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమైంది. ఈ కేసును సుమోటగా తీసుకున్న హైకోర్ట్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ఈ హైలెవల్ కమిటీని నియమించింది.