దారుణం : ఇంట్లో పడుకోబెట్టిన ఐదు నెలల పసికందుపై కుక్కల దాడి.. బాలుడు మృతి

దారుణం : ఇంట్లో పడుకోబెట్టిన ఐదు నెలల పసికందుపై కుక్కల దాడి.. బాలుడు మృతి

వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తాండూరు బసవేశ్వర నాగర్ లో కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే నాడు వికారాబాద్ జిల్లా తాండూరులో నాపరాతి పాలిష్ యూనిట్ లో పనిచేస్తున్నారు దత్తు, లావణ్య అనే ఇద్దరు దంపతులు. ఈ క్రమంలోనే మే 14 2024 నాడు, తమ బాలుడిని ఇంట్లో పడుకోబెట్టి ఇంటి పనిచేస్తుంది లావణ్య. డోర్ తెరిచి ఉండటంతో ఇంట్లోకి కుక్క చొరబడి పసికందుపైకి దాడికి దిగింది.  

కుక్క తీవ్రంగా దాడి చేయడంతో రక్తపు మడుగులో అక్కడికక్కడే మరణించాడుబాలుడు సాయినాథ్. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న స్థానిక తాండూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని వెల్లడించారు పోలీసులు.