Central Govt New OTT Platform: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్న కేంద్రం.. రెండేళ్ల పాటు ఉచితం

Central Govt New OTT Platform: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్న కేంద్రం.. రెండేళ్ల పాటు ఉచితం

ప్రస్తుతం వినోదరంగంలో ఓటీటీల హవా నడుస్తోంది. ఎక్కడ చూసినా ఓటీటీల గురించే చర్చ నడుస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షోస్, కామెడీ షోస్ ఇలా ఎన్నో రకాలుగా వినోదాన్ని అందిస్తుండటంతో.. ఆడియన్స్ కూడా ఓటీటీలవైపు మొగ్గుచూపుతున్నారు. ఫ్యామిలీతో థియేటర్స్ కి వెళితే కనీసం రెండు వేల రూపాయల ఖర్చు అవుతుంది. అదే ఓటీటీలో అయితే కేవలం మూడు వందలతో నెల మొత్తం కొత్త కొత్త కంటెంట్ చూసేయొచ్చు. అది కూడా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ అంతా కలిసి. అందుకే ప్రస్తుత జనరేషన్ లో ఓటీటీల డిమాండ్ బాగా పెరిగింది. 

అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తోంది. ప్రస్తుత సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ను అందుబాటులోకి తీసుకురానుందట. భారతీయ సమాజం, సంస్కృతీ సంప్రదాయాలను చూపించడమే లక్ష్యంగా ఈ ప్లాట్‌ఫామ్‌ కొనసాగనుందని సమాచారం. అంతేకాదు.. ఈ కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ని రెండు సవత్సరాలపాటు ఫ్రీగా అందించనున్నారట. ఆ తరువాత నుండి సబ్‌స్క్రిప్షన్ ధరలు నిర్ణయిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ సరికొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అందుబాటులోకి రావడానికి ఇంకాస్త సమయం పట్టనుంది.