హాజీపూర్ హత్యల కేసు విచారణ 17కు వాయిదా

హాజీపూర్ హత్యల కేసు విచారణ 17కు వాయిదా

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ హత్యల కేసు విచారణను కోర్టు ఈనెల 17(శుక్రవారం)వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఇవాళ(బుధవారం) కోర్టులో హాజరుపరిచారు. ఈనెల 17న ప్రాసిక్యూషన్.. డిఫెన్స్ వాదనలు కొనసాగనున్నాయి. బుధవారం ఒక బాలిక కేసులో డిఫెన్స్ వాదనలు పూర్తయ్యాయి. గతేడాది ఏప్రిల్ 25న అదృశ్యమైన బాలిక కేసులో డిఫెన్స్ వాదనలు పూర్తయ్యాయి. మరో ఇద్దరు బాలికల కేసుల్లో వాదనలు వినేందుకు ఈనెల 17కు వాయిదా వేసింది. డిఫెన్స్ వాదనల ఆధారంగా ప్రాసిక్యూషన్ వాదనలు కొనసాగనున్నాయి. బాలికల హత్యాచారం విషయంలో స్పష్టమైన ఆధారాలు లేవని డిఫెన్స్ లాయర్ తెలిపారు.