6 నెలలు పెరోల్‌ కోసం మద్రాసు హైకోర్టులో నళిని పిటిషన్‌

6 నెలలు పెరోల్‌ కోసం మద్రాసు హైకోర్టులో నళిని పిటిషన్‌

ఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో ముద్దాయి నళిని దాఖలు చేసిన పెరోల్‌ పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. తన కుమార్తె వివాహం కోసం తనకు 6 నెలలపాటు పెరోల్‌ ఇవ్వాల్సిందిగా నళిని పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై  తమిళనాడు ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది మద్రాసు హైకోర్టు. తమిళనాడు ప్రభుత్వం నళిని పెరోల్‌కు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌కు ఒక నివేదిక సమర్పించింది.