
న్యూఢిల్లీ : నెస్లే బ్రాండ్ను వాడుతున్నందుకు పేరెంట్ కంపెనీ నెస్లే ఎస్ఏకు చెల్లిస్తున్న రాయల్టీ పేమెంట్ను పెంచడానికి నెస్లే ఇండియా అంగీకరించలేదు. రాయల్టీ పేమెంట్ పెంచడానికి వ్యతిరేకంగా 57.17 శాతం మంది షేరు హోల్డర్లు ఓటు వేశారు. ప్రస్తుతం ఏడాదికి ఇస్తున్న నెట్ సేల్స్లో 4.5 శాతంపై అదనంగా 0.15 శాతం ఇవ్వాలని నెస్లే ఇండియా ప్రపోజ్ చేసింది.
అదే నెస్లే ఎస్ఏ ప్రపోజల్తో నెట్ సేల్లో రాయల్టీ పేమెంట్ 5.25 శాతం మించుతుంది. దీన్ని నెస్లే ఇండియా షేరు హోల్డర్లు వ్యతిరేకిస్తున్నారు. కంపెనీ షేరు శనివారం 1.28 శాతం పెరిగి రూ.2,500 దగ్గర ముగిసింది.