దోచుకున్న సొమ్ముకోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు : మంత్రి సీతక్క

దోచుకున్న సొమ్ముకోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు : మంత్రి సీతక్క

యాదాద్రి భువనగిరి  పదేండ్లుపాలించి దోచుకున్న సొమ్ముకోసం కేసీఆర్​కుటుంబంలో అన్నాచెల్లి బంధాలను మర్చి ఆస్తుకోసం గొడవలు పడుతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. కేసీఆర్​ పాలనలో మున్సిపాలిటీలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదన్నారు. మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపిస్తే మున్సిపాలిటీలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి సీతక్క. 

బీఆర్ ఎస్​ పాలనలో చేసిన అప్పులతో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం..బీఆర్​ఎస్​, బీజేపీలకు ఓట్లు వేస్తే మురిగిపోయినట్లే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్​ పార్టీకి ఓటు వేస్తే మున్సిపాలీటీలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు సీతక్క. 

భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మంత్రి సీతక్క కార్నర్ మీటింగ్​ లో పాల్గొన్నారు.  ఈ ప్రచారంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్​ కుమార్​ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్​ కుమార్​ రెడ్డిలు, పార్టీ  నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.