క్లాస్ రూంలో అందరూ చూస్తుండగానే..టీచర్ పై స్టూడెంట్ దాడి..వైరల్ వీడియో

క్లాస్ రూంలో అందరూ చూస్తుండగానే..టీచర్ పై స్టూడెంట్ దాడి..వైరల్ వీడియో

క్లాస్​ రూంలో అమానవీయ ఘటన..క్లాసుకు ఎందుకు లేట్​ వచ్చావని టీచర్​అడిగినందుకు..నన్నే ప్రశ్నిస్తావా అంటూ విద్యార్థి ఆగ్రహం.. నేను ఎప్పుడైనా వస్తాను.. ఎప్పుడైనా వెళ్తాను.. నాయిష్టం అంటూ నానా బూతులు.. అంతటితో ఆగక టీచర్​పై అమానుష దాడి.. గుజరాత్​ లోని వడోదర హైస్కూల్​ లో టీచర్​ ను ఓ  విద్యార్థి కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది. 

షాకింగ్​ ఇన్సిడెంట్​..గుజరాత్ లోని వడోదర లో ఓ హైస్కూల్​ లో  టీచర్​ ను ఓ విద్యార్థి చెంప దెబ్బకొట్టిన ఘటన సోషల్​ మీడియాలో చర్చనీయాంశమైంది. షెహ్రా సిటీలో శ్రీమతి ఎస్ జే దేవ్​ సర్వజనిక్​ హై స్కూల్​ లో జనవరి 24న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో క్లాస్​రూంలో విద్యార్థుల క్రమశిక్షణ, ప్రవర్తనపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

క్లాసు రూంలో ఏం జరిగింది.. 

ప్రీ బోర్డు ఎగ్జామ్స్​ జరుగుతుండగా.. ఓ విద్యార్థి ఆలస్యంగా వచ్చాడు. ఎందుకు ఆలస్యంగా వచ్చావంటూ ఎగ్జామ్​ ఇన్విజిలేటర్​ అయిన మహిళా టీచర్​ ప్రశ్నించింది. ఆలస్యానికి కారణం అడిగినందుకు అందరూ చూస్తుండగానే ఆమె చెంప దెబ్బకొట్టాడు. దీంతో  అక్కడున్న విద్యార్థులు, టీచర్​ షాక్​ కు గురయ్యారు. ఆ తర్వాత టీచర్​ ను గట్టిగా పక్కకు తోసేసి క్లాస్​ రూం నుంచి వెళ్లిపోయాడు. గదిలో జరిగిన మొత్తం ఘటన సీసీటీవీ లో రికార్డయ్యింది. 

పోలీసుల ఎఫ్​ ఐఆర్ ప్రకారం.. ఘటన తర్వాత ప్రిన్సిపాల్ ను సంప్రదించి బాలుడి పేరెంట్స్​ కి ఫోన్​ చేసింది. మొదట బాలుడి తండ్రి ఘటనపై విచార వ్యక్తం చేసినా.. మరుసటి రోజు ఇరవై మందితో స్కూల్​ కు వచ్చి బెదిరించారని టీచర్​తెలిపింది. దీంతో 18ఏళ్ల  విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.