ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్ గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఏడాది జైలుశిక్ష విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2016 ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్  వ్యవహారంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై సెక్షన్ 295 ఏ కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదేళ్ల తర్వాత ఈ కేసులో రాజా సింగ్‌కు  ఇటీవల ఏడాది జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాజాసింగ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.