
న్యూయార్క్లో జరగనున్న 43వ ఇండియా డే పరేడ్కు హీరో విజయ్ దేవరకొండ అతిథిగా పాల్గొనబోతున్నాడు. సర్వే భవంతు సుఖినః అనే థీమ్తో ఆగస్టు 17న మాడిసన్ అవెన్యూలో పరేడ్ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు గ్రాండ్ మార్షల్ గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. పహాల్గాం ఉగ్రవాదుల దాడి, అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులకు నివాళులు అర్పించడంతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో 1981వ నుంచి ఈ నిర్వహిస్తున్న ఈ పరేడ్ ప్రపంచంలోనే అతి పెద్ద ఇండియా డే పరేడ్గా ప్రసిద్ధి పొందింది. ఈ వేడుకల్లో పాల్గొనడంపై హీరో విజయ్ దేవరకొండ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ పరేడ్లో గ్రాండ్ మార్షల్గా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, అమెరికాలోని భారతీయులతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకోనుండడం ఆనందంగా ఉందని విజయ్ చెప్పాడు.