ములుగు ఏజెన్సీలో డీజీపీ పర్యటన
వరంగల్: తెలంగాణాలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ అంతటా హై అలర్ట్.. ప్రకటించారు. ములుగు ఏజన్సీకి డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా వచ్చారు. వెంకటాపురం లో డీజీపీ తో సెంట్రల్ ఇంటిలిజెన్స్, సి ఆర్ పి ఎఫ్ అధికారులు భేటీ అయినట్లు సమాచారం. తెలంగాణలోని ఏజెన్సీ ఏరియాల్లో గత రెండు నెలలుగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇవాళ వెంకటాపురంలో పోలీసు, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు కీలక సమావేశం నిర్వహిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది .ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు నెలల వ్యవధిలోనే డీజీపీ మహేందర్రెడ్డి ఇలా ఏజెన్సీలో పర్యటించడం రెండోసారి.