గ్యాస్​ ధర తగ్గించాలని డిమాండ్​

గ్యాస్​ ధర తగ్గించాలని డిమాండ్​

గ్యాస్​ ధర పెంపును నిరసిస్తూ భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం ట్యాంక్ బండ్ పై ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా  నినాదాలు చేశారు.  అనంతరం సిలిండర్​ను సాగర్ లోకి విసిరేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్యాస్​ ధరలు రెట్టింపు అవుతున్నాయని మహిళా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె. కృష్ణ కుమారి, జె. లక్ష్మి, సహాయ కార్యదర్శి విజయ్ లక్ష్మి పండిట్, కార్యవర్గ సభ్యురాలు పాల్గొన్నారు.  – ముషీరాబాద్,వెలుగు