3 లక్షల మెజారిటీ రాకపోతే ఎన్నికలు సరిగా జరగనట్టే

3 లక్షల మెజారిటీ రాకపోతే ఎన్నికలు సరిగా జరగనట్టే

ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఎస్పీ నేత అజంఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాంపూర్ లో తనకు 3 లక్షల మెజారిటీ  రాకపోతే దేశంలో ఎన్నికలు స్వేఛ్చగా జరగనట్టేనని అన్నారు. రాంపూర్ లోక్ సభకు అజంఖాన్ కు పోటీగా బీజేపీ నుంచి జయప్రద పోటీ చేశారు. ఇప్పటికే ఈవీఎంలపై విపక్షాలు దేశ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అజంఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.