పోరాడి ఓడారు : ఆఖరి టీ20లోనూ హర్మన్ టీమ్ ఓటమి

పోరాడి ఓడారు : ఆఖరి టీ20లోనూ హర్మన్ టీమ్ ఓటమి

 హామిల్టన్ : న్యూజీలాండ్ మహిళల క్రికెట్ జట్టుతో వన్డే సిరీస్ ను గెల్చుకున్న భారత మహిళల టీమ్… టీ20 సిరీస్ ను కోల్పోయింది. ఇప్పటికే 0-2 తేడాతో టీ20 సిరీస్ లో వెనకడుగేసిన హర్మన్ ప్రీత్ జట్టు… హామిల్టన్ లో జరిగిన మూడో టీట్వంటీ మ్యాచ్ లోనూ ఓడిపోయింది. షార్ట్ ఫార్మాట్ లో జరిగిన ఆఖరి టీట్వంటీ మ్యాచ్ లో భారత్ ఉమెన్ టీమ్ 2 రన్స్ తేడాతో ఓడిపోయింది.

టాస్ గెలచిన న్యూజీలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఓపెనర్ బ్యాట్స్ ఉమన్ డివైన్(72) ధాటిగా ఆడటంతో.. ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 రన్స్ చేసింది. దీప్తి శర్మ 2 వికెట్లు తీస్తే.. జోషి, ఆర్పీ యాదవ్, ఎ.రెడ్డి, పూనమ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

తర్వాత 162 రన్స్ టార్గెట్ తో చేజింగ్ మొదలుపెట్టిన ఇండియా.. కడదాకా పోరాడింది. కానీ… పరుగుల వేటలో విజయం ముంగిట ఆగిపోయింది. స్టార్ బ్యాట్స్ ఉమన్ మందానా(86.. 62 బాల్స్ లో 12 ఫోర్లు, 1 సిక్సర్) సూపర్ గా పోరాడింది. చివరి ఓవర్ లో 16 రన్స్ కావాల్సిన టైమ్ లో… మిథాలీ రాజ్, దీప్తి శర్మ పోరాడారు. చెరో బౌండరీ కొట్టి విజయం ముంగిటదాకా వచ్చారు. గెలవాలంటే చివరి బాల్ కు 4 పరుగులు అవసరమైనప్పుడు.. బౌండరీ కొట్టలేకపోయారు. సింగిల్ వచ్చింది. 2 పరుగుల తేడాతో ఇండియా ఓడిపోయింది.