ఎల్బీనగర్, వెలుగు: పర్మిషన్ లేకుండా నేషనల్హైవేకు ఇరువైపులా షాపులు నిర్వహిస్తున్న వారికి హయత్ నగర్ స్పెషల్ కోర్టు సోమవారం ఒకరోజు జైలుతో పాటు రూ.50 ఫైన్ వేసింది.
వాహనాదారులకు ఇబ్బందులు కలిగించడంతోపాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు పైన్ విధించి, మున్సిపల్ అధికారుల ద్వారా నోటీసులు ఇచ్చారు. 29 మందిపై పిటీ కేసు నమోదు చేశారు. సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు.