కశ్మీర్ సెక్రటేరియట్ పై భారత జెండా

కశ్మీర్ సెక్రటేరియట్ పై భారత జెండా

జమ్ము కాశ్మీర్‌ సెక్రటేరియట్ పై భారత్‌, కశ్మీర్‌ జెండాలు రెండూ ఎగురుతున్నాయి. ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్ ప్రత్యేక జెండా మాత్రమే రెపరెపలాడుతూ ఉండేది. తాజాగా జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 తొలగిస్తూ పార్లమెంట్ చట్టం చేయడంతో .. ఆ రాష్ట్రం భారత్‌ లో అంతర్భాగమైంది. దీంతో అక్కడ బుధవారం మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అధికారులు. త్రివర్ణ పతాకంతో పాటు జమ్మూ కశ్మీర్ ప్రత్యేక జెండా ను కూడా సెక్రటేరియట్ పై ఎగురవేశారు. అధికారికంగా ఆదేశాలు అందిన వెంటనే ఆ జెండాను తొలగిస్తామని తెలిపారు.