- ఒసాకా మేయర్ కామెంట్స్
- సోషల్ మీడియాలో జనం ఫైర్
టోక్యో : ఆడవాళ్లు షాపింగ్కి వెళితే అంత తొందరగా ముగించరని, అందువల్ల మగవాళ్లే పోయి సరుకులు తెచ్చుకోవటం బెటరని వెస్ట్ జపాన్లోని ఒసాకా సిటీ మేయర్ ఇచిరో మత్సుయి చేసిన కామెంట్స్పై జనాలు ఫైరయ్యారు. ‘సోషల్ డిస్టెన్సింగ్ సరిగా అమలు కావాలంటే భార్యాభర్తలు జంటగా బయటకు వెళ్లొద్దు’ అన్నది మేయర్ ఉద్దేశం. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ కంట్రోల్కు సిటీ జనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సర్కారుకి సహకరించాలని ఇచిరో కోరారు. ఇన్ఫెక్షన్ ఎక్కువ మందికి సోకకుండా ఉండాలంటే షాపింగ్ మాల్స్లోకి కస్టమర్ల ఎంట్రీని తగ్గించటానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న రిపోర్టర్ ప్రశ్నికు మేయర్ పైవిధంగా రియాక్ట్ అయ్యారు.
పొలిటీషియన్లకు ఆడవాళ్లంటే చిన్న చూపు
జపాన్లాంటి దేశంలో ఓ మేయర్ ఇలా మాట్లాడటం సరికాదని ఒక యూజర్ విమర్శించారు. పేరెంటింగ్, నర్సింగ్, ఇంట్లోని పనులను పొలిటీషియన్స్ పెద్దగా పట్టించుకోరనటానికి ఇచిరో కామెంట్సే ఎగ్జాంపుల్ అని మరో యూజర్ మండిపడ్డారు. భిన్న నేపథ్యాలు ఉన్నోళ్లు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరాన్ని ఈ కామెంట్స్ చూపుతున్నారని ఇంకొకాయన అన్నారు. ఒసాకాలో శుక్రవారం నాటికి దాదాపు 1,500 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. రాజధాని టోక్యో తర్వాత ఎక్కువ ఎఫెక్ట్ అయిన సిటీ ఇదే. దీంతో జపాన్ గవర్నమెంట్ మే 6 వరకు నేషన్ వైడ్ ఎమర్జెన్సీ విధించింది.