పాతకాలం నాటి ఇండ్లను గుర్తుకుతెచ్చే గదులు.. వాటి గోడలపై అద్భుతమైన పెయింటింగ్లు... రవివర్మ నుంచి లక్ష్మా గౌడ్ వరకు ఫేమస్ ఆర్టిస్ట్ల చేతుల్లో ప్రాణం పోసుకున్న చిత్రాలు... తోడుగా వందల ఏండ్ల కిందటి లాంతర్లు, వెండి తమలపాకు పెట్టెలు, పైథానీ చీరలు.. ఇంకా మరెన్నో పురాతన వస్తువులకు కేరాఫ్ ఆ మ్యూజియం. దాని పేరు ‘జపుర్జ’. పుణెలోని ఖడక్వాస్లా లేక్ ఒడ్డున ఎనిమిది ఎకరాల్లో ఉంది. అందులో ఎనిమిది ఆర్ట్ గ్యాలరీలు కనిపిస్తాయి. దాదాపు 200 మంది కూర్చోగల ఆడిటోరియం, యాం ఫీథియేటర్, కేఫ్, మ్యూజియం షాప్ కూడా ఉన్నాయి.
పుణెలోని ‘పీఎన్జీ సన్స్’ జువెలరీ షాప్ ఓనర్ అజిత్ గాడ్గిల్ ఈ మ్యూజియం ఏర్పాటుచేశాడు. చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్తోపాటు రకరకాల పాత వస్తువులంటే ఇష్టపడే అజిత్.. వాటితో ఇప్పుడీ మ్యూజియం పెట్టాడు. ఇందులో ఎం.ఎఫ్. హుస్సేన్, రవివర్మ, ఎస్.హెచ్. రజా, కె.హెచ్. అరా, కె.లక్ష్మా గౌడ్ వంటి ఫేమస్ ఆర్టిస్ట్లు వేసిన చిత్రాలు స్పెషల్ అట్రాక్షన్. ఈ ఏడాది మేలో ఈ మ్యూజియం ఓపెన్ అయింది. అప్పటి నుంచి ఇది విజిటర్స్తో కళకళలాడుతోంది. పుణెకు వెళ్లే టూరిస్ట్లు చూడాల్సిన లిస్ట్లో చేరింది. పెయింటింగ్లు, పురాతన వస్తువులు చూడాలనుకునేవాళ్లు తప్పక వెళ్లాల్సిన మ్యూజియమిది.