జార్ఖండ్ లో ఎన్ కౌంటర్..జవాన్ మృతి

జార్ఖండ్ లో ఎన్ కౌంటర్..జవాన్ మృతి

జార్ఖండ్ లోని దుమ్కా వద్ద భద్రతా దళాలకు, మావోయిస్టులకు ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ చనిపోగా.., మరో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురైదుగురు మావోయిస్టులు హతమై ఉంటారని స్థానిక ఎస్పీ YS రమేశ్ తెలిపారు. గాయపడ్డ జవాన్లను హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.